Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణానికి ముందు లంక చేతిలో "పెద్దపులి" చిత్రహింస

Webdunia
శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన వేలుపిళ్లై ప్రభాకరన్‌ను శ్రీలంక సైన్యం చిత్రహింస పెట్టి ఆ తర్వాత క్రూరంగా కాల్చి చంపిందని ఢిల్లీకి చెందిన యూనివర్శిటీ టీచర్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ ( యుథర్) తన నివేదికలో వెల్లడించింది.

ప్రభాకరన్‌ను శ్రీలంక సైన్యం ప్రాణాలతో పట్టుకున్నదనీ, ఆ తర్వాత అతడిని ఓ ప్రముఖ తమిళ రాజకీయనాయకుడు, ఓ జనరల్ సమక్షంలో చిత్రహింసలకు గురిచేసిందని లంక సైన్యానికి చెందిన కొందరు ఉన్నతాధికారులు చెప్పినట్లు తమకు సమాచారం ఉన్నదని తెలిపింది.

ఎల్టీటీఈపై పూర్తి పట్టు బిగించిన అనంతరం లంక సైన్యం ప్రభాకరన్‌ను సజీవంగా పట్టుకున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత అతడిని 53 డివిజన్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో చిత్రహింసకు గురిచేసినట్లు తెలుస్తోంది.

అంతేకాదు ప్రభాకరన్ 12 ఏళ్ల చిన్న కుమారుడు బాలచంద్రన్‌ను సైతం లంక సైన్యం ప్రభాకరన్ కళ్లెదుటే హతమార్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇంతకుమించి మాట్లాడటానికి యుథర్‌కి చెందిన అధికారులు నిరాకరించారు. అయితే ప్రభాకరన్‌ను చిత్రహింసలకు గురిచేసి చంపిన మాట మాత్రం వాస్తవమని నమ్మేందుకు ఆధారాలున్నట్లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments