Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యప్రాచ్య దేశాధినేతలకు ఒబామా పిలుపు

మధ్యప్రాచ్య దేశాధినేతలకు ఒబామా పిలుపు
వైట్‌హౌస్ సందర్శనానికి రావల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మధ్యప్రాచ్య దేశాలైన ఈజిప్టు, పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాధినేతలను ఆహ్వానించారు. మధ్యప్రాచ్యంలో సమగ్ర శాంతిని నెలకోల్పే దిశగా ఈ ప్రాంత దేశాధినేతలకు ఒబామా ఆహ్వానం పలికారని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ విషయమై వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి రాబర్ట్ గిబ్స్ మాట్లాడుతూ మధ్యప్రాచ్య దేశాధినేతల సందర్శనానికి సంబంధించిన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. జోర్డాన్ రాజు అబ్ధుల్లాతో మంగళవారం జరిగిన సమావేశం విజయవంతమైన నేపథ్యంలో ఒబామా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈజిప్టు, పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాధినేతల అమెరికా సందర్శనానికి సంబంధించిన తేదీలను ఖరారు చేసే విషయాన్ని తాము ప్రస్తుతం పరిశీలిస్తున్నామని గిబ్బ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu