Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ - ఆస్ట్రేలియా విమాన సర్వీసులు కావాలి : చిరంజీవి

భారత్ - ఆస్ట్రేలియా విమాన సర్వీసులు కావాలి : చిరంజీవి
, బుధవారం, 5 డిశెంబరు 2012 (14:38 IST)
File
FILE
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి తన బాధ్యతల్లో పూర్తిగా నిమగ్నమైపోయారు. పర్యాటక శాఖలో ఉన్న లోపాలపై ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఇందులోభాగంగా ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య డైరక్ట్ ఫ్లైట్ సర్వీసులు కావాలంటూ ఆస్ట్రేలియాను కోరారు.

ఇదేవిషయంపై ఆస్ట్రేలియా పర్యాటక మంత్రి మార్టిన్ ఫెర్గుసన్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వారిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ టూరిజంతో అనుబంధం కలిగి ఉన్న అన్ని వర్గాలతో చర్చలు జరపడం ద్వారా టూరిజం పెంచుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

మరోవైపు.. భారత పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల వీసాల నిబంధనల్లో సడలింపులు చేసినట్టు చెప్పారు.

భారత్‌లో పర్యటించాలంటే రెండు పర్యటనల మధ్య రెండు నెలల వ్యవధి ఉండాలనే నిబంధనను సోమవారం తొలగించినట్టు తెలిపారు. అయితే, ఈ నిబంధన సడలింపుతో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, ఇరాన్, పాకిస్థాన్, ఇరాక్, సూడాన్ సంతతికి చెందిన వారికి వర్తించదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu