Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయులపై దాడులు జాతివివక్షా పూరితమే!

భారతీయులపై దాడులు జాతివివక్షా పూరితమే!
, బుధవారం, 20 జనవరి 2010 (11:39 IST)
ఆస్ట్రేలియాలోని భారతీయులపై జరుగుతున్న దాడులు జాతి వివక్షా పూరితమైనవేనని ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ అభిప్రాయపడ్డారు. ఆసీస్ అధికారులు చేస్తున్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. ఆస్ట్రేలియాలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న భారతీయులపై గత 18 నెలలుగా వివిధ రకాల దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే.

ఈ దాడులపై ఆ దేశ అధికారులు వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు జాతి వివక్షతో కూడుకున్నవని చెపుతుండగా, మరికొందరు మరోరకం దాడులుగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ పీటర్ కోస్గరోవ్ మాట్లాడుతూ.. ఈ దాడులు జాతి వివక్షతోనే జరుగుతున్నట్టు చెప్పారు.

అయితే, వీటిపై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. భారత మీడియా కూడా ఈ దాడులు జాతివివక్షతోనే జరుగుతున్నట్టు ప్రసారం చేస్తుండగా, ఆస్ట్రేలియా అధికారులు మాత్రం క్రిమినల్ దాడులగా పేర్కొనడం గమనార్హం. కానీ ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ మాత్రం ఆసీస్ అధికారుల వ్యాఖ్యలతో విభేదించారు. 2005 సంవత్సరంలో సిడ్నీ బీచ్‌లో జరిగిన దాడి కూడా జాతివివక్ష దాడేనని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu