Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫుకుషిమా అణు ప్లాంట్‌ను సందర్శించనున్న బాన్‌కీ మూన్

Advertiesment
బాన్ కీ మూన్
, గురువారం, 4 ఆగస్టు 2011 (09:30 IST)
జపాన్‌లోని భూకంపం, సునామీ బాధిత ప్రాంతాల్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ వచ్చే శనివారం నుంచి పర్యటించనున్నారు. గత మార్చి 11వ తేదీన జపాన్‌ను భారీ భూకంపం కుదిపేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సునామీ సంభవించడంతో వేలాది మంది ప్రజలు చనిపోగా.. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ఈ భూకంపం కారణంగా ఫుకుషిమా డైచీ అణు విద్యుత్ కర్మాగారం కూడా దెబ్బతింది. దీంతో ప్లాంట్‌లోని రియాక్టర్ నుంచి అణుథార్మకత విడుదలైంది. ఈ నిషేధిత ప్రాంతాన్ని బాన్ కీ మూన్ సందర్శించనున్నారు. దీనికి టోక్యో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ వ్యతిరేకత తెలిపినప్పటికీ ఆయన ససేమీరా అంటున్నారు. ఖచ్చితంగా ఆ విద్యుత్ కర్మాగారాన్ని సందర్శించాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా, మూన్ జపాన్ పర్యటన వచ్చే శనివారం నుంచి ప్రారంభంకానుంది.

అక్కడ నుంచి ఫుకుషిమా నగరంలోని ఒక ఉన్నత పాఠశాల విద్యార్థులతో మాట్లాడతారని ఆయన ప్రతినిధి వెల్లడించారు. అనంతరం జపాన్ రాజదాని టోక్యోలో ఆ దేశ ప్రధాని నావుటో కాన్‌, విదేశాంగ మంత్రి టకేకీ మట్సుమోటోతో సమావేశమవుతారు.

Share this Story:

Follow Webdunia telugu