Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెషావర్ హోటల్‌పై దాడి: 11 మంది మృతి

Webdunia
పెషావర్‌లో మంగళవారం ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించడంతో 11 మంది మృతి చెందారు. నగరంలో గట్టి భద్రత ఉండే ప్రదేశంలో ఉన్న ఈ హోటల్‌పై జరిగిన బాంబు దాడిలో మరో 50 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ రాజధాని పెషావర్‌లో కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న పెరల్ కాంటినెంటల్ హోటల్‌పై బాంబు దాడి జరిగింది.

హోటల్ ప్రాగంణంలో మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడు తీవ్రతకు హోటల్ వెనుకభాగం కూలిపోయింది. ఏడు కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారని పోలీసులు చెబుతుండగా, మృతుల సంఖ్య పదికిపైగానే ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. హోటల్ ప్రాంగణంలోని 30 వాహనాలు బాంబు పేలుడులో ధ్వంసం అయ్యాయి.

సమీపంలోని మసీదు కూడా దెబ్బతింది. ఈ హోటల్‌పై జరిగిన బాంబు దాడిలో గాయపడినవారిలో ప్రావీన్స్ మంత్రి, ఓ చట్టసభ సభ్యుడు ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు పేలుడుకు ముందు ఐదుగురు సాయుధులు హోటల్‌లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని సాక్షులు తెలిపారు. అనంతరం హోటల్ భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈమధ్యలోనే పేలుడు పదార్థాలు నింపిన కారును తీవ్రవాదులు పేల్చివేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments