Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్ జైలులో భారతపౌరుడి మృతి

పాక్ జైలులో భారతపౌరుడి మృతి
లాహోర్(ఏజెన్సీ) , శుక్రవారం, 10 ఏప్రియల్ 2009 (14:52 IST)
ఓ భారత పౌరుడు పాక్‌లోని జైలులో హృద్రోగంతో బాధపడుతూ మృతి చెందాడు. అతడు పాకిస్థాన్‌లో ఎక్కువ సమయం ఉన్నాడనే ఆరోపణలతో అతడిని గత నెలలో అరెస్టు చేసి జైలులో ఉంచారు.

ఇతను ఉత్తరప్రదేశ్ నివాసి అని, ఇతని పేరు ముహమ్మద్ నయీమ్(25) గత కొద్దిరోజులుగా హృద్రోగంతో బాధపడుతూ జైలులోని ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసు అధికార వర్గాలు తెలిపాయి.

ముహమ్మద్ అహ్మద్ కుమారుడైన నయీమ్ పాకిస్థాన్‌లో ఎక్కువరోజులుండటంమూలాన అతనిని జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అతని శవాన్ని పరీక్షలు నిర్వహించినమీదట స్వదేశానికి తరలిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా భారతదేశ ఉన్నతాధికారులకు ఈ సమాచారం చేరవేశామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu