Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా: కొండచరియలు విరిగిపడి 78 మంది మృతి

Webdunia
నైరుతీ చైనాలోని ఓ లోయలో కొండచరియలు విరిగిపడటంతో 78 మంది పౌరులు దుర్మరణం చెందారు. లోయలోని ఇనుప ఖనిజం గని, అనేక ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయని అధికారిక యంత్రాంగం తెలిపింది. వులోంగ్ కౌంటీలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.

ఇనుప ఖనిజం, సహజవాయువు, ఇతర ఖనిజ నిక్షేపాలు సంవృద్ధిగా కలిగివున్న ఈ ప్రాంతంలో తరుచుగా పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సుమారు 500 మంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇప్పటివరకు 78 మంది మృతదేహాలను గుర్తించారు. ఏడుగురు పౌరులు ప్రాణాలతో శిథిలాల నుంచి బయటపడ్డారు.

వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో పౌరులతో పాటు గని కార్మికులు కూడా ఉన్నారు. బాధిత ప్రాంతంలో అన్నిరకాల సహాయ చర్యలు చేపట్టాలని అధికారిక యంత్రాంగాన్ని చైనా అధ్యక్షుడు హుం జింటావో ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments