చైనాపై ఆప్ఘనిస్థాన్ తాలిబన్ తీవ్రవాదులు కన్నేసినట్టు టైమ్స్ కథనం పేర్కొంది. చైనాలో ఎపుడైనా.. ఎక్కడైనా హింసాకాండకు పాల్పడవచ్చని ఆ పత్రిక పేర్కొంది. ఇప్పటికే భారత్, పాకిస్థాన్లపై దాడులకు దిగిన తాలీబాన్లు ఏ క్షణంలోనైనా చైనాపై దాడి చేయవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నట్టు ఆ పత్రిక పేర్కొంది.
చైనా అంతటా విస్తృతంగా వ్యాపించివున్న ఈ విద్రోహ శక్తులతో పొంచివున్న ముప్పుపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తీవ్రవాదానికి అడ్డా అయిన పాకిస్థాన్కు తాలిబాన్లు పెను సవాల్గా మారారని అంతేకాకుండా భారత్, పాక్ వంటి ఇతర అగ్ర దేశాలలో దాడులకు విస్తృతంగా కార్యకలాపాలు సాగిస్తున్నారని అంతర్జాతీయ నిఘా వర్గాలు వెల్లడించాయి.