Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబోకు చేరుకున్న తమిళనాడు ఎంపీల బృందం

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2009 (15:45 IST)
శ్రీలంక తమిళుల జీవన స్థితిగతులు, వారు నివశిస్తున్న ప్రాంతాల్లోని పరిస్థితులను పరిశీలించేందుకు తమిళనాడుకు చెందిన పార్లమెంట్ సభ్యుల బృందం ఒకటి ఆ దేశ రాజధాని కొలంబోకు చేరుకుంది. తమిళనాడు ప్రభుత్వం అనుమతి మేరకు ఈ బృందం అక్కడ పర్యటిస్తోంది.

డీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, ఏకేఎస్. విజయన్, టీకేఎస్ఇళంగోవన్, హెలన్ డేవిడ్సన్, కాంగ్రెస్ తరపున సుదర్శన్ నాచియప్పన్, ఎన్.ఎస్.వి.సిద్దన్, కేఎస్.అళగిరి, జేఎం.హారూణ్, వీసీకే తరపున తోల్.తిరుమావళవన్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

కాగా, ఈ బృందానికి కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి నేరుగా హోటల్‌కు చేరుకున్న ఎంపీల బృందం శ్రీలంక తూర్పు ప్రాంతాల్లో పర్యటించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. ఐదు రోజుల పాటు శ్రీలంక తమిళుల నివాసిత ప్రాంతాల్లో పర్యటించే ఈ బృందం ఈనెల 14వ తేదీన చెన్నయ్‌కు చేరుకుని ముఖ్యమంత్రి ఎం.కరుణానిధికి ఒక నివేదికను సమర్పిస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments