Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీ హింసపై విచారణకు పాక్ పార్లమెంట్ కమిటీ

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2011 (15:09 IST)
పాకిస్థాన్ పార్లమెంట్ దేశ ఆర్థిక రాజధాని కరాచీలో క్షీణించిన శాంతి భద్రతలపై విచారణ జరపడానికి గానూ 17 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కొన్ని నెలలుగా జరుగుతున్న హింసలో కేవలం జులై నెలలోనే 300 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఓడరేవు పట్టణమైన కరాచీలో ఈ హింసకు సంబంధం ఉన్న 185 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కరాచీ హింసపై దర్యాప్తు జరిపే కమిటీని జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఫెమిదా మీర్జా‌ నియమించారు. అన్ని రాజకీయ పార్టీల డిమాండ్ మేరకు స్పీకర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కు చెందిన ఐదుగురు ఎంపీలు, ప్రతిపక్ష పార్టీలు పాకిస్థాన్ ముస్లీం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పీఎంఎల్-క్యూల నుంచి నలుగురేసి ఎంపీలు, అవామీ నేషనల్ పార్టీ, ఎంక్యూఎం, జమాత్ ఉలేమా ఈ ఇస్లాం ఫజ్లూర్‌ల నుంచి ఒక్కొక్క ఎంపీకి చోటు కల్పించారు. కమిటీ బలూఛిస్థాన్‌లో పరిస్థితిని కూడా సమీక్షించి పార్లమెంట్‌కు తుది నివేదికను సమర్పిస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments