Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒసామా ఆచూకీ పాక్ అధికారులకు తెలుసు: హిల్లరీ

ఒసామా ఆచూకీ పాక్ అధికారులకు తెలుసు: హిల్లరీ
, సోమవారం, 10 మే 2010 (17:42 IST)
అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ పాకిస్థాన్ అధికారులకు తెలుసని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. పాక్ ప్రభుత్వంలోని కొన్ని శక్తులకు (అధికారులకు) అల్‌ఖైదా, తాలిబన్ నేతల ఆచూకీ ఎరుకేనని ఆయన చెప్పారు. టైమ్స్ స్క్వేర్ బాంబింగ్ ప్లాట్ సంఘటన అనంతరం వాషింగ్టన్ యంత్రాంగం ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. లాడెన్ గురించిన సమాచారం ఉన్నత స్థాయి వర్గాలకు తెలుసని తాను చెప్పలేను. కానీ కొంతమంది ప్రభుత్వంలోని కొంతమందికి లాడెన్, ముల్లా ఓమర్, ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ నేతల ఆచూకీ తెలుసన్నారు.9/11 దాడులతో సంబంధం ఉన్న వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు లేదా పట్టుకునేందుకు లేదా చంపేందుకు పాకిస్థాన్ నుంచి మరింత సహకారం కోరుతూ ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

ఒకవేళ ఇందుకు పాకిస్థాన్ సహకరించని పక్షంలో ఏం చేస్తారని ప్రశ్నించగా, ప్రస్తుతం వారిలో మార్పు వచ్చింది. అది మరింతగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఇకపోతే టైమ్స్ స్క్వేర్ కారు బాంబు ఘటనతో సంబంధం ఉన్న వారిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్టు ఆమె తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu