Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎల్‌టీటీఈ తీవ్రవాదులు 21మంది మృతి

ఎల్‌టీటీఈ తీవ్రవాదులు 21మంది మృతి
శ్రీలంకలోని ఉత్తర ప్రాంతంలో ఎల్‌టీటీఈని అంతమొందించడానికి శ్రీలంక సైన్యం ఎల్‌టీటీఈ దళాలకు చెందిన మిగిలిన స్థావరాలపై దాడులకు పాల్పడుతూ ముందుకు దూసుకు వెళుతున్న సందర్భంలో దాదాపు 21మంది తమిళ విద్రోహులు మృతి చెందారు.

ముల్లైతీవు అడవులలోని అమాపలావనపోక్కనయీలో ఎల్‌టీటీఈకి సైన్యానికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. ఇందులో ఎల్‌టీటీఈ దళాలకు చాలా నష్టం సంభవించినట్లు మీడియా సెంటర్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ(ఎమ్‌సీఎన్ఎస్) వెల్లడించింది.

పుదుకుదియిరిప్పూ క్షేత్రంలో గురువారంనాడు జరిగిన ఈ భీకర పోరాటంలో ఎల్‌టీటీఈకి చెందిన నాలుగు శవాలను అలాగే వారినుండి మందుగుండు సామగ్రిని తాము స్వాధీనం చేసుకున్నట్లు సైనిక దళాలు తెలిపాయి. ఎల్‌టీటీఈ దళాలపై జరిగిన యుద్ధంలో వారికి చాలా నష్టం సంభవించినట్లు రక్షణ శాఖ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu