Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్ఫా నాయకుడిని భారత్‌కు అప్పగించనున్న బంగ్లా

Webdunia
బంగ్లాదేశ్ తమ దేశంలో నిర్భంధించిన యునైటెడ్ లిబరేషన్ ఆఫ్ అసోమ్(ఉల్ఫా) నాయకుడు అనూప్ ఛేతియాను భారత్‌కు అప్పగించనున్నట్లు బుధవారం వెల్లడించింది. భారత్‌కు అప్పగించే విషయంలో న్యాయపరమైన అంశాలన్నింటినీ పరిశీలించినట్లు బంగ్లా హోం మంత్రి సహారా ఖతున్ తెలిపారు.

1997 లో బంగ్లాదేశ్‌లో అరెస్ట్ అయిన ఉల్ఫా ప్రధాన కార్యదర్శి అనూప్ ఛేతియా జైలు శిక్ష ముగిసిన అనంతరం నిర్భంధంలో వున్నాడు. ఉల్ఫా భారత్‌లోని అస్సాం రాష్ట్రం స్వతంత్ర దేశంగా అవతరించడానికి 1979 నుంచి పోరాడుతున్న ఉగ్రవాద సంస్థ. గత రెండు దశాబ్దాల్లో ఈ పోరాటంలో సుమారు పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు.

భారత హోం మంత్రి పి. చిదంబరం ఇటీవల జరిపిన ఢాకా పర్యటన తర్వాత బంగ్లాదేశ్ ఛేతియాను అప్పగించడానికి ముందుకు కదిలింది. చిదంబరం పర్యటనలో బంగ్లాలో తలదాచుకుంటున్న యాభై మంది భారత నేరస్థుల జాబితాను భారత అధికారులు బంగ్లాదేశ్‌కు అందించారు. వారిని అప్పగించాలని భారత్ కోరింది.

భారత అధికారులు అందజేసిన జాబితాలో అనూప్ ఛేతియా టాప్‌లో ఉన్నట్లు బంగ్లా హోం కార్యదర్శి అబ్దుస్ సోభన్ సిక్దర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ కూడా వంద మంది తమ దేశ నేరస్తుల జాబితాను భారత్‌కు అందించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments