Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇరాక్‌లో వరుస బాంబు పేలుడు: 14 మంది మృతి

ఇరాక్‌లో వరుస బాంబు పేలుడు: 14 మంది మృతి
, గురువారం, 8 మార్చి 2012 (13:08 IST)
ఇరాక్‌ వరుస బాంబు పేలుడు ఘటనలో 14 మంది మృతి చెందారు. ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని దుర్గోమెన్ నగరంలో వరుస బాంబు పేలుడు సంఘటనలు జరిగాయి. వరుసగా రెండు బాంబులు పేలడంతో 14 మంది మరణించగా, పదమందికిపైగా గాయపడ్డారు. దుర్గోమెన్ నగరంలో జనసంచారం అధికంగా గల ప్రాంతంలో ఈ వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయని భద్రతా అధికారులు తెలిపారు.

ఇకపోతే.. ఈ పేలుళ్ల ఘటనకు ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే బాంబు పేలుళ్లు సంభవించిన ప్రాంతంలో అల్ ‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఆధారాలు ఉన్నట్లు భద్రతాదళ అధికారులు వెల్లడించారు. కాగా, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించినట్లు అధికారులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu