Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభద్రతతో పాకిస్థాన్‌ను వీడిన 35 మంది హిందువులు

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2011 (13:32 IST)
భద్రతాపరమైన ఆందోళనలతో జాకోబాబాద్‌ జిల్లా థుల్ పట్టణంలో ఐదు కుటుంబాలకు చెందిన ముప్పై ఐదు మంది హిందువులు పాకిస్థాన్‌ను శాశ్వతంగా వదలిపెట్టి భారత్‌కు పయనమయ్యారు.

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని పాలనలో సింధూ ప్రావిన్స్‌లో హిందువుల హత్యలు, కిడ్నాప్‌లు, దాడులు ఎక్కువ అయినట్లు పాకిస్థాన్ టుడే దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. సింధూ ప్రావిన్స్‌లో అనేక మంది హిందువులు తమ ఆస్తులను అమ్ముకొని వ్యాపారాలను కూడా వదలిపెట్టి పలు ఇతర దేశాలకు వలసవెళ్తున్నారు. తాజా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన హిందూ నాయకులు మైనారిటీల భద్రతకు హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఉన్నత విద్యావంతులైన సింధ్ ప్రావిన్స్‌లోని హిందువులు డాక్టర్లు, ఇంజనీర్లుగా పనిచేయడంతో పాటు అనేక ప్రధాన వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. 1998 జనాభా లెక్కల ప్రకారం పాకిస్థాన్‌లో 2.7 మిలియన్ల హిందువులు నివసిస్తున్నారు. అనంతరం ఏర్పడ్డ పరిస్థితులతో పెద్ద సంఖ్యలో వలసవెళ్లినట్లు హిందూ నాయకులు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments