Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అబుదాబిలో బస్సు బోల్తా: ముగ్గురు భారతీయలు మృతి

అబుదాబిలో బస్సు బోల్తా: ముగ్గురు భారతీయలు మృతి
దుబాయ్‌లోని అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముస్సాఫ్ నగరం నుంచి అబుదాబికి కొంతమంది కూలీలను తీసుకెళుతున్న బస్సు అతివేగం కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా అందులో ముగ్గరు భారతీయులు, ఓ పాకిస్థానీ ఉన్నట్లు పోలీసు అధికారులు తెలియజేశారు.

పాకిస్థాన్‌కి చెందిన బస్సు డ్రైవరును సమీప ఆల్ మఫ్రక్ ఆస్పత్రకి తరలిస్తుండగా మృతి చెందగా మిగిలిన ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణీకులు ఉండగా, అందులో 26 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశస్తుడు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu