Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికి రోజు

తొలి స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికి రోజు
భారత గడ్డపై ఆంగ్లేయులు ఏకాధిపత్య పరిపాలనకు వ్యతిరేకంగా తొలిస్వాతంత్ర్య పోరాటం 1852వ సంవత్సరం మే నె 10వ తేదీన ప్రారంభమైంది. దేశం యావత్తు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళంవిప్పింది. ఇండియా-బ్రిటిష్ సైనిక దళాల్లో పనిచేసిన సిపాయిలపై జరిపిన అక్రమ చర్యలకు ఆగ్రహం చెందిన భారతీయులు తమ దేశ ప్రజలపై విదేశీయులు ఆధిపత్యం వహించడాన్ని సహించలేకపోయారు.

ఈ నేపథ్యంలో బ్రిటిష్- ఇండియా సైనిక దళాలకు అందించిన ఎన్‌ఫీల్డ్ తుపాకీల్లో ఉపయోగించే తూటాలపై రాసే ఆవు, పంది క్రొవ్వులతో అసలు సమస్య ప్రారంభమైంది. ఈ అంశంపై బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని సిపాయిలు ఎదిరించేందుకు సిద్ధమయ్యారు. జాతి, మత బేధాలు లేకుండా భారతీయులమనే నినాదంతో పోరాటాన్ని ప్రారంభించారు. దీంతో దేశంలో మత విద్వేషాలు తలెత్తాయని బ్రిటిష్ పాలకులు ఆరోపించారు.

అయితే అదే సిపాయిల తిరుగుబాటుగా అవతరించి తెల్లదొరలకు వ్యతిరేకంగా స్వతంత్ర్య పోరాటంగా మారింది. ఇదిలా ఉండగా భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల ఆధీనం నుంచి తొలగించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన ఈ సమరాన్ని జమీందారులు ముందుండి నడిపించారు. ఆయుధాలను చేతపూని చేపట్టిన ఈ విప్లవంలో కార్మిక వర్గంతో పాటు.. అన్నీ వర్గాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తొలుత బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో ప్రారంభమైన విప్లవాన్ని అణచి వేసేందుకు తెల్లదొరలు వివిధ రకాల చర్యలు చేపట్టారు. భూములకు పన్ను విధించడం, చేనేత కార్మికుల శ్రమను దోచుకోవడం వంటి చర్యలు చేపట్టారు. అయినా లెక్కచేయని ప్రజలు.. విప్లవాన్ని మరింత ఉధృతం చేశారు. దీంతో ఈ పోరాటం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది.

జమీందారుల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నియాసఫ్ విప్లవంలో సైనిక వీరులు కూడా పాల్గొన్నారు. 1763 నుంచి 1800 వరకు సందియాసఫ్ విప్లవం జరిగింది. ఆ తర్వాత 1766 నుంచి 1772 వరకు బెంగాల్లో ఈ విప్లవం జరిగింది. దీన్ని బెంగాల్ విప్లవంగా పేర్కొంటారు. దేశంలో అనేక ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వ చర్యలు పెట్రేగి పోవడంతో విప్లవాలు అనేక ప్రాంతాల్లో జరిగాయి.

ఆపిమ్మట స్వదేశ రాజులు పరిపాలించిన ప్రాంతాలను అన్యదేశమైన బ్రిటిష్ ప్రభుత్వ అధికారంలో తీసుకొచ్చిన డల్హౌసీ ప్రభు విధానంతో పరిస్థితి మరింత దిగజారింది. బ్రిటిష్ అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానా సాహెబ్, జాన్సీ రాణి, బహదూర్ షా వంటి ఉద్యమకారులు నడుం బిగించారు. సిపాయిలకు జీతం తగ్గించటం, వారిని హీనంగా నడిపించడం వంటి అరాచక చర్యలను బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టింది. ఈ చర్యలకు వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు 1857లో ప్రారంభమైంది.

Share this Story:

Follow Webdunia telugu