ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే తన దుస్తులన్నింటినీ విప్పేసి నగ్నంగా నిలబడతానని ప్రకటించి సంచలం సృష్టించిన హాటెస్ట్ మోడల్ పూనం పాండే ఎఫ్ఐఆర్ నమోదయింది.
మీడియాలో వచ్చిన కథనాలను సుమోటాగా స్వీకరించిన ఉత్తరప్రదేశ్లోని బలరామ్పూర్ దెహాత్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుభాష్ చంద్ర మోడల్ పూనమ్ పాండేపై కేసు నమోదు చేయాలని ఆదేశించటంతో బలరామ్పూర్ దెహాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా కింగ్ఫిషర్ సంస్థ మోడల్ అయిన పూనమ్ మాత్రం ఇది టీమీండీయాకు తెలిపే తన మద్దతులో భాగమని చెప్తున్నది.
కాగా, ముంబైలోని వాఖండే స్టేడియంలో జరుగనున్న ఫైనల్ పోరులో భారత జట్టు ప్రపంచకప్ను సాధిస్తే తాను మైదానంలో దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా నిలబడతానని హాటెస్ట్ మోడల్ పూనం పాండే ప్రకటించిన సంగతి తెలిసిందే. తన దేశం విజయానికి తన అందాన్నంతా చూపిస్తానని వెల్లడించింది. జట్టుకు స్ఫూర్తిని అందించడానికే తాను దుస్తులిప్పేసేందుకు సిద్ధపడుతున్నానే తప్ప ఏదో ప్రచారం కోసం కాదని పాండే ఇటీవల సెలవిచ్చింది.