Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజృంభించిన మలింగ: మాస్టర్ సచిన్ టెండూల్కర్ అవుట్!

విజృంభించిన మలింగ: మాస్టర్ సచిన్ టెండూల్కర్ అవుట్!
శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ విజృంభించడంతో ప్రపంచకప్ ఫైనల్ పోరులో భారత్ 6.2 ఓవర్లకే కీలక రెండు వికెట్లు కోల్పోయింది. భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బరిలోకి దిగిన రెండో బంతికే మలింగ బౌలింగ్‌లో డకౌట్‌ కాగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 18 పరుగుల వద్ద మలింగ బంతిని సంగక్కర క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు.

14 బంతులాడిన సచిన్ రెండు ఫోర్లతో 18 పరుగులు సాధించాడు. తద్వారా మాస్టర్ బ్లాస్టర్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో వందో శతకాన్ని నమోదు చేసుకోలేకపోయాడు. ప్రస్తుతం గౌతం గంభీర్ (12), విరాట్ కోహ్లీ (0)లు క్రీజులో ఉన్నారు. ఫలితంగా 7 ఓవర్లలో భారత్ రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మలింగ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu