Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచకప్ ఫైనల్లో మాస్టర్ సచిన్ వందో శతకం కొట్టాలి: నిత్య

ప్రపంచకప్ ఫైనల్లో మాస్టర్ సచిన్ వందో శతకం కొట్టాలి: నిత్య
దేశ వాణిజ్య నగరం ముంబైలోని వాఖండే స్టేడియంలో జరుగనున్న ఫైనల్ పోరులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వందో శతకం సాధించాలని శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ అత్త నిత్య ఆకాంక్షించారు. అయితే భారత్-శ్రీలంకల మధ్య జరుగనున్న ఫైనల్ మ్యాచ్ టై కావాలని ఆమె కోరుకుంటున్నారు.

''ప్రపంచకప్‌ ఫైనల్‌ విషయంలో మురళీ భార్య మది కచ్చితంగా తన భర్తకే మద్దతిస్తుంది. కానీ నేను మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నా. అయితే మా అల్లుడికి ప్రపంచకప్ ఫైనల్ చివరి వన్డే చేదు జ్ఞాపకం కాకూడదని నిత్య వ్యాఖ్యానించారు.

అలాగే భారత్‌ కూడా ఫైనల్‌ ఓడిపోతే చాలా బాధగా ఉంటుంది. అందుకే అటూ ఇటూ కాకుండా మ్యాచ్‌ 'టై'గా ముగియాలని కోరుకుంటున్నానని నిత్య వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu