Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయం: ఫైనల్‌కు భారత్

పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయం: ఫైనల్‌కు భారత్
, బుధవారం, 30 మార్చి 2011 (22:51 IST)
FILE
కోట్ల మంది ఎంతో ఉత్కంఠగా చూసిన భారత్ - పాకిస్తాన్ సెమీఫైనల్స్‌లో భారత్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్ సంగతి ఎలా ఉన్నా బౌలింగ్, ఫీల్డింగ్ అదిరిపోయింది. ఇరు దేశాలకు చెందిన దేశాధినేతలు, సెలబ్రిటీలకు టీమిండియా కనువిందు చేసే ఆట తీరును కనబర్చి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నది భారత్.

టాస్ గెలిచి బ్యాటింగ్ తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ కు 261 విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కమ్రాన్ అక్మల్(19), మహ్మద్ హఫీజ్(43) ఇన్సింగ్స్ ను ధాటిగా ఆరంభించారు. అయితే భారత్ బౌలర్లు పట్టు సాధించడంతో పాకిస్తాన్ వరుసగా వికెట్లను సమర్పించుకుని 231 పరుగులకే కుప్పకూలింది.

Share this Story:

Follow Webdunia telugu