నేను చెబుతున్నా... ఫైనల్లో సచిన్ "శత"క్కొడతాడు: అమీర్
, గురువారం, 31 మార్చి 2011 (13:35 IST)
బుధవారం మొహాలీలో జరిగిన భారత్ - పాకిస్తాన్ సెమీఫైనల్కు బాలీవుడ్ సినిమా నటీనటులు చాలామంది వచ్చారు. బాలీవుడ్ బాద్షా షారుక్తోపాటు అమీర్ ఖాన్ కూడా గ్యాలరీ నుంచి టీమిండియాకు మద్దతు తెలుపుతూ కేరింతలు కొట్టాడు. భారత్ విజయానికి చేరువ కాగానే అమీర్ ఖాన్ సీట్లోంచి లేచి ఎగురుతూనే ఉన్నాడు. శ్రీలంకపై జరిగే ఫైనల్ పోరులో భారత జట్టు విజయం సాధించి కప్పు సాధిస్తుందని అమీర్ జోస్యం చెప్పాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ ఫైనల్లో తప్పకుండా ఒకరోజు అంతర్జాతీయ విఫణిలో తన 100వ సెంచరీ పూర్తి చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత జట్టు గెలుపుకు గట్టి పునాది సచినే అని నిన్నటి సెమీఫైనల్లో సచిన్ మరోసారి నిరూపించాడన్నాడు. భారత్ వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పుడు తను చాలా టెన్షన్ ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు. అయితే భారత ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి చక్కటి ఆట తీరును ప్రదర్శించారని కితాబిచ్చాడు అమీర్.