Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పళ్ళు తెల్లగా.. ఆరోగ్యంగా.. మెరవాలంటే.. తులసి టూత్ పౌడర్...

పళ్ళు తెల్లగా.. ఆరోగ్యంగా.. మెరవాలంటే.. తులసి టూత్ పౌడర్...
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (14:28 IST)
మనిషికి నవ్వు అందం. ఆ నవ్వుకి పళ్ళవరస అందం. పళ్ళవరస చక్కగా అమరినప్పటికీ, పళ్ళు పసుపు పచ్చ రంగులో ఉంటే నలుగురిలో నవ్వుకోడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి. కనుక మీ దంతాలు ఆరోగ్యంగా తెల్లగా మెరిసిపోవాలంటే తులసి టూత్ పౌడర్‌ను ట్రై చేసి చూడండి.
 
తులసి టూత్ పౌడర్ తయారీ :
తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత, ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్‌చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతి వేలితో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇంకా, మీ రెగ్యులర్ పేస్ట్‌కు తులసి పౌడర్‌ను జతచేసి, బ్రష్ చేసుకోవచ్చు. తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా, ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu