Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మడోన్నాపై నెటిజన్స్ ఫైర్ : ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ ఫోటోనే కారణం..

మడోన్నాపై నెటిజన్స్ ఫైర్ : ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ ఫోటోనే కారణం..
, బుధవారం, 15 జులై 2015 (17:44 IST)
పాప్ సింగర్ మడోన్నాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఇన్‌స్టా‌గ్రాంలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోనే కారణం. అంతేకాదు.. తల్లి పట్ల పిల్లలు చూపిస్తున్న ప్రేమ అని ఆ పోస్ట్‌లో మడోన్నా పేర్కొంది. అయితే ఈ ఫోటో ప్రస్తుతం వివాదాస్పదమైంది. మడోనా నేలపై పడుకుని ఉండగా, ఆమె ఇద్దరు పిల్లలు నవ్వుతూ ఆమె కాళ్లకు మర్దన చేస్తున్నట్టు ఉంటుంది. 
 
ఆ ఫోటోలు ఉన్న వారిద్దరూ మడోనా దత్తత తీసుకున్న తొమ్మిదేళ్ల నల్లజాతి పిల్లలు డేవిడ్ రిచి, మెర్సీ జేమ్స్. ఈ ఫోటోపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిద్దరూ నల్లజాతీయులు అయినందునే మడోనా వారిని బానిసలుగా చూస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా డేవిడ్ రిచి, మెర్సీ జేమ్స్ కాకుండా మడోనాకు 15 ఏళ్ల సొంత కుమారుడు రోకో ఉన్నాడు. అలాగే 18 ఏళ్ల కుమార్తె లాడ్స్ కూడా ఉంది. మరి ఈ ఫోటోపై మడోన్నా ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu