సీమ భద్రాద్రి రాముడుగా పేరుమోసిన కోదండ రాముడు తిరుమల వెంకన్న ఏలుబడిలోకి వచ్చేశాడు. బుధవారం ఉదయం ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసే పత్రాలను ఆలయ ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి అప్పగించారు. ఈ కార్యక్రమం ఒంటిమిట్టలో జరిగింది. ఈ ఆలయం ఖమ్మంలోని భద్రాచల రామాలయం అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించడం ఖాయమని ఆయన అన్నారు.
విజయనగర సామ్రాజ్య కట్టడాలకు నిదర్శనమైన 16వ శతాబ్దం నాటి ఈ కోదండ రామాలయం తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోకి రావడం విశేషమని అన్నారు. బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు పుట్టిన కడప జిల్లాకు ఇక శోభ సంతరించుకుంటుందని ఆయన అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయనతోపాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డాక్టర్ హరిప్రసాద్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.