తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరువు గంగపాలై, అనేక విమర్శలు విన వస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇది చర్చనీయాంశం అయ్యింది.
మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శనంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. సభాపతికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకున్నట్లు కోడెల తెలిపారు.