Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆళ్వార్ల జీవితం యువకులకు ఆదర్శం కావాలి. : టీటీడీ జేఈవో భాస్కర్

ఆళ్వార్ల జీవితం యువకులకు ఆదర్శం కావాలి. : టీటీడీ జేఈవో భాస్కర్
, శనివారం, 31 జనవరి 2015 (21:07 IST)
తమిళ ఆళ్వార్ల జీవితాన్ని యువకులు ఆదర్శంగా తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్ తెలిపారు. శనివారం శ్వేత భవనంలో దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రారంభించి 25 యేళ్లు పూర్తయిన సందర్బంగా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పూర్తి జీవితాన్ని వారు ధర్మప్రచారం కోసం వేంకటేశ్వర స్వామి సేవలో గడిపారని కొనియాడారు. సమాజానికి భక్తి మార్గాన్ని చూపారని చెప్పారు. అదే సమయంలో నైతిక విలువలను కూడా చూపారని చెప్పారు. 
 
ప్రబంధాలను చదివే వారికి కనీసం వేతనాలను పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు రమణదీక్షితులు, వేదిక్ విశ్వవిద్యాలయం విసి కేఈ దేవనాథన్ తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu