Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కనుల పండువలా శోభాయాత్ర

కనుల పండువలా శోభాయాత్ర
, ఆదివారం, 15 ఫిబ్రవరి 2015 (08:07 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతీ ఏటా శ్రీనివాస మంగాపురం వార్షిక బ్రహ్మోత్సవాలకు నిర్వహించే శోభాయాత్రను కనుల పండువలా నిర్వహించారు. తిరుమల నుంచి వచ్చిన సీమ కమలాలు, కెంపు, శంఖ చక్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద నుంచి వచ్చిన ఈ ఆభరణాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. వీటితో లక్ష్మీ కాసుల హారాన్ని శనివారం సాంప్రదాయబద్ధంగా ఊరేగించారు.  
 
వీటిని తిరుపతి జేఈవో పోలా భాస్కర్ శనివారం శ్రీనివాస మంగాపురంలో జరిగిన గరుడ సేవకు తీసుకెళ్ళారు.  ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వేడకగా నిర్వహించింది. దీనిని భక్తులు తిలకించి ఆనంద పరవశ్యులయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుమల డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ శెల్వం, విజివో రవీంధ్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu