Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఘనంగా అన్నమయ్య 512వ వర్ధంతి మహోత్సవాలు...ఉత్సవాలలో గవర్నర్

ఘనంగా అన్నమయ్య 512వ వర్ధంతి మహోత్సవాలు...ఉత్సవాలలో గవర్నర్
, బుధవారం, 18 మార్చి 2015 (10:39 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న అన్నమయ్య 512వ వర్ధంతి ఉత్సవాలలో రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం తిరుమల నారాయణగిరి వనంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తిరుమల శ్రీవారిపై అన్నమయ్య 32 వేల సంకీర్తనలు పాడారు. భావములోనా... పడగంటినయ్యా... ఎంత మాత్రమున.. బ్రహ్మకడిగిన పాదమూ.. తదితర కీర్తనలు చేశారు. ఆయన ఆలపించిన ఈ సంకీర్తనలు ప్రముఖ వోకలిస్టులు ఆలపించారు. 
 
తిరుమలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నమయ్య, మలయప్ప స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డిప్యూటీ జివో మునిరత్నం రెడ్డి, డిప్యూటీ ఈవో సి రమణ తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu