Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకుంఠా ఏకాదశి ఏర్పాట్లలో రాజీ పడొద్దు : టీటీడీ జేఈవో

వైకుంఠా ఏకాదశి ఏర్పాట్లలో రాజీ పడొద్దు : టీటీడీ జేఈవో
, గురువారం, 18 డిశెంబరు 2014 (20:54 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో, తిరుపతిలో చేస్తున్న ఏర్పాట్లలో ఎక్కడా రాజీ ధోరణి ప్రదర్శించవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి విభాగ సంయుక్త కార్యదర్శి పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒకే ఒక రోజు కార్యక్రమని అనే నిర్లక్ష్యం పనికి రాదన్నారు. ఒక్క రోజైనా వచ్చే భక్తులు లక్షల్లో ఉండడవలన లక్ష్యం పెద్దదేనని అన్నారు. 
 
అందుకే ఈ కార్యక్రమాన్ని సవాల్ గా తీసుకోవాలని కోరారు. అదే రోజు ఆంగ్ల సంవత్సరాది కూడా వస్తుండడంతో తాకిడి అధికంగానే ఉంటుందన్నారు. ఏర్పాట్ల విషయంలో విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్త పడాలని ఆదేశించారు.  
 

Share this Story:

Follow Webdunia telugu