Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యా.. బాత్ హై..! బ్లాకులో సేవాటికెట్లు కొన్నా కేసులే... టీటీడీ ఛైర్మన్ చదలవాడ

క్యా.. బాత్ హై..! బ్లాకులో సేవాటికెట్లు కొన్నా కేసులే... టీటీడీ ఛైర్మన్ చదలవాడ
, బుధవారం, 30 సెప్టెంబరు 2015 (08:11 IST)
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం టికెట్లు విక్రయించే దళారులే కాదు. వాటి కొనుగోలు చేసి వారిపై కూడా కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 
 
తిరుమలలో మంగళవారం అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ, దళారీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అంతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విక్రయించడం ఎంతటి నేరమో.. కొనుగోలు చేయడం కూడా అంతే నేరమని అభిప్రాయపడ్డారు. 
 
అందుకే సులభంగా శ్రీవారి దర్శనం కల్పించడానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని దానిని వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu