ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో 108వ సంఖ్యకు ప్రత్యేక స్థానం ఎందుకు?
, మంగళవారం, 28 జనవరి 2014 (17:46 IST)
హిందూ సంప్రదాయములో 108వ సంఖ్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఉపయోగించే పవిత్ర మాలలో 108 పూసలు వుంటాయి. ఒక్క హిందూ సంప్రదాయంలోనే కాకుండా బౌద్ధ, సిక్కు, జైన మతాచారాల్లో సైతం ఈ సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంది. మంత్రోచ్ఛరణను 108 సార్లు చేయడం ఆచారం. జపాన్లోని జైన దేవాలయాల్లో కొత్త సంవత్సరం ఆరంభం నాడు 108 సార్లు గంటలు కొడతారు. ఎందుకీ సంఖ్యకు అంత ప్రాధాన్యం తెలుసుకోవాలంటే... ఇంకా చదవండి. మన ప్రాచీన ఋషులు గొప్ప గణాంకవేత్తలు. నిజానికి మన సంఖ్యావ్యవస్థను గుర్తించినది వారే. ఈ సంఖ్యకు ప్రాధాన్యాన్ని వారే సంతరించిపెట్టారు. * తొమ్మిది సంఖ్య పరిపూర్ణత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 108ని కూడితే వచ్చేది తొమ్మిది. అంతేకాదు ఏ సంఖ్యను 9 సార్లు హెచ్చించి, కూడినా వచ్చే సంఖ్య తొమ్మిదే. * తొమ్మిది గ్రహాలు 12 రాశుల గుండా ప్రయాణిస్తాయి. వాటిని గుణించగా అంటే 9x12= 108 వస్తుంది. * 27 నక్షత్రాలలో ఒక్కోదానికి నాలుగు పాదాలుంటాయి. 27 నక్షత్రాలు అగ్ని, భూమి, గాలి, నీరు అన్న నాలుగు అంశాలపై విస్తరించి వుంటాయి. అంటే 27x4=108. * ప్రాచీనకాలంనాటి తాళపత్ర గ్రంథాల్ని అనుసరించి విశ్వం 108 అంశాల కలయికతో ఏర్పడింది.