Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రక్తపోటుకు చెక్ పెట్టాలంటే.. రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోండి!

రక్తపోటుకు చెక్ పెట్టాలంటే.. రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోండి!
, సోమవారం, 27 ఏప్రియల్ 2015 (15:24 IST)
శరీరంలో రక్తం శుభ్రంగా లేకపోతే... అలసట, జ్వరం, ఉదర సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అందుచేత రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, రక్తాన్ని శుద్ధీకరించే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రక్తాన్ని శుద్ధీకరించాలంటే ముఖ్యంగా బీట్ రూట్ తీసుకోవాలి. తద్వారా శరీరంలో రక్తం ఉత్పత్తి అవుతుంది. 
 
అలాగే మునక్కాయ.. కందిపప్పుతో చేసిన వంటకాలు తీసుకోవచ్చు. రోజూ ఓ కోడిగుడ్డును తీసుకోవచ్చు. నేరేడు పండ్లను రోజూ తీసుకుంటే బ్లడ్ క్లీనవుతుంది. టమోటా పండును తింటే కూడా రక్తం శుభ్రమవుతుంది. ఇంకా రోజూ ఒక కప్పు పెరుగు తీసుకుంటే రక్త నాళాలను శుభ్రపరచినట్లవుతుంది. 
 
రక్తపోటును దూరం చేసుకోవాలంటే.. కాచి చల్లార్చిన నీటిలో జీలకర్ర పొడిని వేసి 12 గంటల పాటు నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక గ్లాస్ మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకుంటే రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇవి కాకుండా అవిసె ఆకులన్ని వారానికి రెండు సార్లు తీసుకుంటే హై బీపీని నిరోధించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu