నిద్రలేమికి కారణాలేంటి....? అధిగమించడమెలా....?
, మంగళవారం, 23 జులై 2013 (15:27 IST)
కారణం లేకుండా నిద్రపట్టకపోవడం లేదా నిద్ర పట్టిన తర్వాత గాఢనిద్రలోకి చేరుకోలేకపోవడం కొంతమందికి తొందరగానే నిద్రపడుతుంది. కాని అర్థరాత్రి మెలకువ వస్తుంది. చాలా మంది నిద్రపోయిన తర్వాత నిద్రలేచే సమయానికంటే చాలా ముందరే మెలుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఎంత ప్రయత్నించినా వీరికి నిద్రరాదు. మగవారిలో కన్నా ఆడవారిలో నిద్రలేమి ఎక్కువుగా ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ వ్యాధి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం వలన నిద్రలేమి వ్యాధి వస్తుంది. వాత, కఫ, పిత్త వ్యాధుల వలన వచ్చే నిద్రలేమికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు...* రాత్రి పదిగంటలకు నిద్రపోవాలి. * పడుకునే ముందు పాలు త్రాగాలి.* వేడి ఆహారం తినటం మంచిది.* ఒత్తిడితో కూడిన పని చేయరాదు.* మసాలా పదార్థాలు తీసుకోకపోవడం మంచిది.* ఉపవాసం చేయరాదు.* వ్యాయామం చేయటం మంచిది* గోరు వెచ్చని నీరు త్రాగాలి.* తీపి, పులుపు, లవణ పదార్థాలు తినటం తగ్గించాలి.