Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీళ్లు ఎలా తాగాలి.. నిలబడి నీళ్లు తాగకూడదా? కచ్చితంగా కూర్చునే తాగాలా? ఎందుకు?

నిలబడి ఉన్నప్పుడు నీటిని సేవిస్తే నీరు ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశ‌యం గోడ‌లు

నీళ్లు ఎలా తాగాలి.. నిలబడి నీళ్లు తాగకూడదా? కచ్చితంగా కూర్చునే తాగాలా? ఎందుకు?
, బుధవారం, 29 జూన్ 2016 (17:06 IST)
దాహమేస్తే నీళ్లను తాగేయడం వరకే మనకు తెలుసు. అది కూర్చుని తాగుతున్నామా? నిల్చుని తాగుతున్నామా? అనేది తర్వాతి విషయం. కానీ నీళ్లు తాగేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లైనా తాగాలి. నీటిని తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. అయితే నీటిని ఎంత తాగినా, ఎప్పుడు తాగినా నిల‌బ‌డి మాత్రం తాగ‌కూడ‌ద‌ట‌. 
 
క‌చ్చితంగా కూర్చునే నీటిని తాగాల‌ట‌. ఎందుకంటే..? నిలబడి ఉన్నప్పుడు నీటిని సేవిస్తే నీరు ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశ‌యం గోడ‌లు దెబ్బ తింటాయి. జీర్ణాశయ గోడలు దెబ్బతింటే.. అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక నిలబడి ఉన్నప్పుడు కానీ నీరు తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదని.. తద్వారా కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
కానీ కూర్చున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ స్థితిలో నీరు తాగితే.. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాదు జీర్ణాశ‌యంలోకి అధికంగా ఉత్ప‌త్తి అయ్యే ఆమ్లాల ప్ర‌భావం త‌గ్గుతుంది. అదే నిలబడి నీరు తాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతినడంతో ఎక్కువ ద్రవాలు కీళ్లలో చేరిపోయి ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాడీ పెయిన్స్‌కు ఇంగ్లీష్ మందులొద్దు.. ఆలివ్ ఆయిల్, ఉప్పే ముద్దు!