Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరకడుపున లీటరు నీళ్లు తాగితే...?

పరకడుపున లీటరు నీళ్లు తాగితే...?
, సోమవారం, 3 ఆగస్టు 2015 (17:02 IST)
నేటి ఆధునిక యుగంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, ప్రకృతిలో చోటుచేసుకున్న మార్పులతో పాటు పలు కారణాల వలన మనలను పలు రకాలైన అనారోగ్యాలు వెన్నంటే వుంటాయి. అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలలైనా ఆదిలోనే హరించే దివ్యౌషధం మంచి నీళ్లే అని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతి రోజు ఉదయం పూట లీటరు మంచి నీళ్లు తాగితే పలు రోగాలు మటుమాయమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
 
కార్యాలయాల్లో ఉద్యోగస్తులు రోజుకు తొమ్మిది, పది గంటల పాటు ఒకే సీట్లో కూర్చుని పనిచేస్తుంటారు. అటువంటి వారి పొట్టలో మందం చేరి, జీర్ణశక్తి 0తగ్గిపోతుంది. వారు ప్రతి రోజు ఉదయాన్నే మంచి నీళ్లు తాగితే, ఆ నీళ్లు పొట్టను క్లీన్ చేయడమే కాకుండా జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి. ఉదయం పూట వ్యాయామం చేసే అలవాటు ఉన్న వాళ్లు చాలా ఎనర్జీ కోల్పోతుంటారు. 
 
అటువంటి వాళ్లకు ఒక లీటర్ మంచి నీళ్లు శరీరానికి ప్రొటీన్స్ బాగా అందేలా చూస్తాయి. కోల్పోయిన ఎనర్జీని తిరిగి తెస్తాయి. అంతకాదండోయ్ రక్తంలోని మలినాలను తరిమికొడతాయి. వాతావరణ కాలుష్యం కారణంగా పలువురి చర్మ డల్‌గా తయారవుతుంది. అటువంటి వారు క్రమం తప్పకుండా రోజు లీటరు నీళ్లు తాగితే చర్మ మెరిసిపోతుంది. మితి మీరి బరువు పెరిగిన వాళ్లు ప్రతి రోజు పరకడుపున మంచి నీళ్లు తాగితే బరువు అతి సులభంగా తగ్గిపోతారు.
 
ముఖ్యంగా ఇటీవల అత్యధిక సంఖ్యలో పురుషులు ఎదుర్కునే సమస్య కిడ్నీలో రాళ్లు. ఈ సమస్యకు అసలైన మందు మంచి నీళ్లే అని వైద్యులు తెలుపుతున్నారు. రోజూ లీటర్ మంచి నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు చేతులు. ఇంతటి మేలు చేసే మంచి నీళ్లను తాగడమం ఎవరూ మరువకండి.

Share this Story:

Follow Webdunia telugu