Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. రోజూ ఓ కప్పు చేపలు తినాల్సిందే

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. చేపలు తినాల్సిందే. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి రెండు లేదా మూడు సార్లు చేపల కూరను ఆహారంలో చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రతిరోజూ చేపల ఆహారం కప్పు మోతాద

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. రోజూ ఓ కప్పు చేపలు తినాల్సిందే
, గురువారం, 29 జూన్ 2017 (12:00 IST)
గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. చేపలు తినాల్సిందే. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి రెండు లేదా మూడు సార్లు చేపల కూరను ఆహారంలో చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రతిరోజూ చేపల ఆహారం కప్పు మోతాదులో తీసుకుంటూ వుంటే, గుండె సవ్యంగా పనిచేస్తుందని తద్వారా గుండెపోటు వంటి హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
 
మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యలతోపాటు కంటిచూపు తగ్గుతుంది. ఈ సమస్యకు పరిష్కారం వారానికి రెండుసార్లు చేపలను తినడం చేయాలి. వారానికి రెండుసార్లు చేపలు తినడం ద్వారా ఇందులోని ఒమేగా-3 కంటిచూపును మెరుగుపరుస్తాయి. 
 
మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలంగా వ్యవహరిస్తాయని, అందుకే ఇవి పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చని.. అలాగే మధుమేహాన్ని కూడా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆయిలీ ఫిష్ తింటే టైప్-2 డయాబెటిస్‌తో బాధపడే మధ్యవయసు, వృద్ధుల్లో కంటిచూపు సురక్షితంగా ఉంటుందని పరిశోధనలో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమృతం అంటే నిమ్మకాయ..!