Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలుష్యంతో నగర జీవి మెదడుకు దెబ్బే..!

కాలుష్యంతో నగర జీవి మెదడుకు దెబ్బే..!
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (18:33 IST)
దేశంలో గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగానూ, పట్టణ ప్రాంతాలు నగరాలుగానూ, నగరాలు మహా నగరాలు గానూ దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఈ అభివృద్ధి మంచిదే. అయితే, జనాభా పెరుగుతున్న కొద్దీ కాలుష్యం కూడా భారీగా పెరిగిపోతుంది. గాలితో పాటు నీరు కలుషితం కావడంతో పాటు భూ పర్యావరణం (గ్లోబర్ వార్మింగ్) సైతం వేడెక్కిపోతోంది. 
 
ముఖ్యంగా నగరాల్లో కాలుష్య ప్రభావం అంతా ఇంతా కాదు. అందుకే నగర వాసులు గాలి కాలుష్యంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యంతో మెదడుకు దెబ్బేనని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా గాలి కాలుష్యంతో మెదడుకు సంబంధిత వ్యాధులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
ఎలుకలపై నిర్వహించిన టెస్టుల్లో కలుషితమైన గాలిని పీల్చడంలో శారీరకంగా కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో పాటు, మెదడు సంబంధించి నెగటివ్ ఫలితాలు వచ్చాయని ఓహియో స్టేట్ యూనివర్శిటీ స్టడీలో తేలింది. గాలి కాలుష్యంతో గుండె, ఊపిరితిత్తులకు ప్రమాదమని ఇంతకుముందు నిర్వహించిన సర్వేలో తేలగా, మొట్టమొదటి సారిగా గాలి కాలుష్యంతో మెదడుకు సంబంధిత వ్యాధులు సోకుతాయని తేలింది. పట్టణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో బసచేసే వారికే గాలి కాలుష్యంతో ప్రమాదం ఎక్కువని ఫాకెన్ చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu