Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మష్రూమ్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి!

మష్రూమ్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (16:59 IST)
మష్రూమ్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రక్తహీనతను దూరం చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మష్రూమ్ వెజ్ కావడంతో హైబీపీని కంట్రోల్ చేయడంతో పాటు రక్తనాళాల్లోని కొవ్వును తొలగిస్తుంది. 
 
మష్రూమ్‌లోని ఎరిటైన్ అనే పదార్థం అనారోగ్యాలను దూరం చేస్తుంది. వారంలో మూడు నాలుగు సార్లైన మష్రూమ్ తీసుకోవడం ద్వారా పోషకలేమిని తొలగించుకోవచ్చు. ఇందులో పీచు, విటమిన్స్, అమినో యాసిడ్స్, కొవ్వు, పిండిపదార్థాలు తక్కువ స్థాయిలో ఉంటాయి.  
 
మష్రూమ్‌లో కూరగాయలు, పండ్ల కంటే ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ప్రోటీన్లు ఇందులో ఉండటం ద్వారా రక్తహీనతకు మష్రూమ్స్ దివ్యౌషధంగా పనిచేస్తాయి.  
 
ఇకపోతే మధుమేహగ్రస్థులకు మష్రూమ్ ఉత్తమమైన ఆహారం. పీచు కలిగిన మష్రూమ్స్‌ను డయాబెటిస్ వ్యాధిగ్రస్థుతులు తీసుకోవడం ద్వారా ఉదర సంబంధిత వ్యాధులు దరి చేరవు. గుండె పదిలంగా ఉంటుంది. మోకాలు నొప్పులను దూరం చేస్తుంది.  
 
సంతాన లేమి, మహిళలకు గర్భ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రోజూ మష్రూమ్ సూప్ తీసుకోవడం ద్వారా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
వంద గ్రాముల మష్రూమ్స్‌లో 35 శాతం ప్రోటీన్స్ ఉండటం ద్వారా పిల్లల పెరుగుదలకూ ఎంతగానో ఉపయోగపడుతుంది. మాంసాహారం కంటే మష్రూమ్స్ తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu