Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయంకాలం పూట ఆకలేస్తుందా..? వేడి వేడి బజ్జీలు తినొద్దు!

సాయంకాలం పూట ఆకలేస్తుందా..? వేడి వేడి బజ్జీలు తినొద్దు!
, శనివారం, 4 ఏప్రియల్ 2015 (17:37 IST)
సాయంకాలం పూట ఆకలేస్తుందా? వేడి వేడి బజ్జీలు తినొద్దు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వేసవిలో నూనె పదార్థాలు.. వేడి వేడి స్నాక్స్‌పై అస్సలు దృష్టిపెట్టకూడదని వారు సూచిస్తున్నారు. సాయంకాలం పూట ఆకలైతే సుమారు 13-14 బాదం పప్పులు తినమని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. ఇది హెల్దీ స్నాక్. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉన్నా.. కడుపు నిండుతుందని వారు చెబుతున్నారు. 
 
రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండడమే కాక, కేలరీల స్వీకరణ కూడా తగ్గుతుంది. ఒక యాపిల్ కేవలం 100 కేలరీలు కలిగి వుంటుంది. అందుకని కరకరలాడే యాపిల్‌ను సాయంత్రం స్నాక్స్ తీసుకునే సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకంటే దాంట్లో వుండే కరిగే పీచు పదార్ధం వల్ల వాతావరణంలోని కాలుష్య కారకాల నుంచి రక్షణ లభిస్తుంది. కొలెస్టరాల్ కూడా బాగా తగ్గుతుంది. 
 
కడుపు నిండి, తక్కువ కేలరీలు శరీరానికి లభించాలంటే స్నాక్స్ టైమ్‌లో 30 ద్రాక్ష పండ్లు తినండి. ఇవి రక్తహీనత, అలసట, కీళ్ళ నొప్పులను, కీళ్ళ వాతాన్ని, రుమాటిజంను, తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఇందులో కేవలం ఇవి 100 కేలరీలు మాత్రమే కలిగి వుంటాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu