Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జంక్‌ఫుడ్‌తో జర జాగ్రత్త.. లేకుంటే ప్రమాదమే!

జంక్‌ఫుడ్‌తో జర జాగ్రత్త.. లేకుంటే ప్రమాదమే!
, సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (16:15 IST)
జంక్‌ఫుడ్‌తో జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదముందని పరిశోధకులు అంటున్నారు. పిజ్జా, బర్గర్‌లు తింటున్నారంటే చాలు మెమరీ లాస్ తప్పదు. వెయ్యిమంది ఆరోగ్యకరంగా ఉన్న పురుషులకు అధిక కొవ్వు ఉన్న కేక్‌లు, పేస్ట్రీలు, చిప్స్, ఫాస్ట్‌ఫుడ్ తిన్న తర్వాత వారిలో జ్ఞాపకశక్తి తగ్గిందని కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో యూనివర్శిటీ నిర్వహించిన సర్వేలో తేలింది. 
 
అంతేగాకుండా జంక్ ఫుడ్ అధికంగా తీసుకునేవారిలో జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు అధిక ఒత్తిడికి కూడా గురవుతున్నారని పరిశోధనలో తేలింది. జంక్‌ఫుడ్ తిన్నవారిలో ఒత్తిడి కారణంగా హృద్రోగాలు, కేన్సర్‌లకు కూడా దారితీస్తుంది. అందుకే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి ఆహార పదార్థాలు తినడాన్ని తగ్గించడం ద్వారా హృద్రోగ సమస్యలు దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu