Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టాలంటే.. అరటి పండు తినండి..!

డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టాలంటే.. అరటి పండు తినండి..!
, శనివారం, 23 మే 2015 (18:16 IST)
మండే ఎండల్లో డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టాలంటే.. అరటి పండు తినండి. నీరు ఎక్కువగా తాగండి. అరటిపళ్ళలో నీటి పరిమాణం ఎక్కువ. డీహైడ్రేషన్‌లో తగ్గిపోయే క్యాల్షియంను ఇది భర్తీ చేస్తుంది. డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుని.. అప్పుడప్పుడు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఒక టీ స్పూన్ పుదీనా రసం, అర టీ స్పూన్ అల్లపు రసం ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. 
 
దానిమ్మ రసం తాగితే దాహం తీరుతుంది. గింజలు తిన్నా సరిపోతుంది. ఇక ఒక కప్పు మజ్జిగలో అర టీ స్పూన్ శొంఠిపొండి కలిపి రోజుకు 3, 4 సార్లు తాగాలి. అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు కలిపి పొడి చేసి, నాలుగు స్పూన్ల పెరుగు కలిపి 3 సార్లు తీసుకోవాలి. పచ్చి బొప్పాయి కోరులో 3 కప్పుల నీరు కలపి, 10 నిమిషాలు మరగనివ్వాలి. వడబోసి ఒక రోజు కంటే ఎక్కువగా నిల్వ వుంచకుండా తాగవచ్చు.
 
ఒక ఆపిల్ ఉడకబెట్టి దానిలో కొంచెం జాజికాయ పొడి, ఒక చెంచా పంచదార కలిపి ఎండవేళ టిఫిన్‌గా ఇవ్వవచ్చు. అయితే ఎండల్లో పియర్, పీచెస్, కాఫీ, టీ, ఆల్కహాల్, వేపుళ్ళు, మసాలా దినుసులు, మాంసాహారం తీసుకోకూడదు. 

Share this Story:

Follow Webdunia telugu