Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'గ్లోబల్ థింకర్స్' జాబితాలో మోడీ ఫస్ట్.. మూడో స్థానంలో అమిత్ షా!

'గ్లోబల్ థింకర్స్' జాబితాలో మోడీ ఫస్ట్.. మూడో స్థానంలో అమిత్ షా!
, మంగళవారం, 18 నవంబరు 2014 (11:24 IST)
ప్రపంచ అగ్రశ్రేణి విధాన నిర్ణేతల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడో స్థానంలో ఉండగా, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మార్కెల్ రెండో స్థానంలో ఉన్నారు. అమెరికన్ ఫారిన్ పాలసీ మ్యాగజైన్ వందమందితో 'గ్లోబల్ థింకర్స్' పేరుతో ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో భారత్ నుంచి బీజేపీకి చెందిన మోడీ, అమిత్ షాలు చోటు దక్కించుకున్నారు. 
 
మోడీ కేవలం విధాన నిర్ణేత మాత్రమే కాదనీ, 'మోడీ ఒక ఆకర్షణీయమైన, వ్యాపారానికి స్నేహపూర్వక నాయకుడు' అని మ్యాగజైన్ వర్ణించింది. 'భారతలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో... తన ఆకర్షణతో చాలామందిని మోడీ ఒప్పించారు. కేవలం వ్యక్తిగా భారతదేశ వృద్ధిని పునరుద్ధరించడానికి వ్యాపారానికి స్నేహపూర్వక నేతగా ఉన్నారు. ఆయన ప్రసంగం వందల, వేల మందిని ఆకర్షించింది. 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ద్వారా మిలియన్ల జనాభాకు చేరువయ్యారు' అని పత్రిక పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu