Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పట్టాలు తప్పిన ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ రైలు: ముమ్మరంగా సహాయచర్యలు

పట్టాలు తప్పిన ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ రైలు: ముమ్మరంగా సహాయచర్యలు
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (11:20 IST)
తమిళనాడులోని సోమనాయినిపట్టి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఐలాండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘనటలో 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. బెంగళూరు నుంచి కన్యాకుమారికి వెళుతున్న ఐలాండ్ ఎక్స్ ప్రెస్ సోమనాయినిపట్టి స్టేషన్‌కు సమీపంలో వస్తుండగా పట్టాలు అదుపుతప్పింది. మొత్తం ఐదు బోగీలు పట్టాల నుంచి విడిపోయి చెల్లాచెదురుగా పడిపోయింది.
 
బోగీల్లో చిక్కుక్కున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదవాతావరణం నెలకొంది. తెల్లవారుజామున 5.30గంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా ఎలాంటి సహాయం అందకపోవటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. 
 
ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు తమ లగేజిలతో సహాయచర్యల కోసం ఎదురుచూస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమేంటని ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu