Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్తి కోసం కన్నతండ్రిని భర్తతో కలిసి చంపిన కూతురు.. విజయనగరంలో దారుణం!

ఆస్తి కోసం కన్నతండ్రిని భర్తతో కలిసి చంపిన కూతురు.. విజయనగరంలో దారుణం!
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (12:51 IST)
విజయనగరం జిల్లాలోని శ్రీహరిపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కూతురే భర్తతో కలిసి కన్నతండ్రిని హత్య చేసింది. వివరాల్లోకి వెళితే, విజయనగరం జిల్లాకు చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి  కాంట్రాక్టులు చేస్తూ ఆస్తిని బాగా సంపాదించాడు. అతనికి  ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె.
 
అప్పలనాయుడి భార్య చనిపోవడంతో ఇంకో స్త్రీతో సంబంధం ఏర్పరచుకున్నాడు. అంతటితో ఆగిపోలేదు ఏకంగా ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాడు. అప్పటినుండి ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. ఆస్తి వారికి దక్కకుండా ఆ మహిళకి దక్కుతుందని భావించిన కుమార్తె తండ్రిని చంపేందుకు ప్రణాళిక రూపొందించింది. 
 
భర్త వెంకటరమణతో కలిసి తండ్రి అప్పలనాయుడిని కూతురు కొట్టి చంపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu