Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సముద్రంలో అగ్నిపర్వతం బద్దలౌతుందా...!

సముద్రంలో అగ్నిపర్వతం బద్దలౌతుందా...!
ఇండోనేషియాలోని పశ్చిమతీర ప్రాంతంలో ఉన్న హిందూ మహాసముద్రంలో కొందరు శాస్త్రజ్ఞులు భారీ అగ్ని పర్వతాన్ని కనుగొన్నారు. సునామీలు వాటి తీరు తెన్నుల గురించి అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలకు ఈ అగ్నిపర్వతం కనపడింది.

దాదాపు 15 వేల అడుగుల ఎత్తున్న ఈ భారీ అగ్నిపర్వతం 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, సముద్ర భూగర్భ శాస్త్రవేత్త యూసుఫ్‌ సూరజ్‌మన్‌ డిజాజా దిహర్జా వెల్లడించారు.

దీనిని కనుగొనడం పూర్తిగా ఊహించని పరిణామని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాని వలన మానవాళకి పెద్దగా ప్రమాదం ఏమీ లేదన్నారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొన్న ఈ అగ్ని పర్వతం సుమత్రా దీవులకు పశ్చిమంగా 330 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన తెలిపారు.

ఈ అగ్నిపర్వతం పై అంచులు సముద్ర మట్టానికి 1,380 మీటర్ల లోతులో ఉందన్నారు. సునామీల వల్ల ప్రపంచానికి ఉన్న ముప్పు గురించి తెలుసుకునేందుకు ఈ శాస్త్రవేత్తల బృందం ప్రయత్నిస్తోంది.

ఇదివరకు 2004లో ఆసియా ప్రాంతంలో సంభవించిన సునామీ కారణంగా దాదాపు 2,30,000 మంది మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో సగం మంది భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్నవారేనని ఆ శాస్త్రజ్ఞులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu