Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్వరలో పెళ్లి చేసుకుంటామన్నారు.. అందుకే పంపించాం!

త్వరలో పెళ్లి చేసుకుంటామన్నారు.. అందుకే పంపించాం!
, శనివారం, 23 ఆగస్టు 2014 (14:09 IST)
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు త్వరలో వివాహం చేసుకోబోతున్నామని చెప్పడంతోనే ఇంగ్లండ్ టూర్‌కు ఇద్దరూ కలిసి వెళ్లేందుకు అనుమతినిచ్చామని బీసీసీఐ స్పష్టం చేసింది. 

ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌కు విరాట్‌ కోహ్లితో పాటు ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్కను అనుమతించడంపై ప్రస్తుతం దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. బీసీసీఐ విరాట్‌కు గర్ల్‌ ఫ్రెండ్‌ను తీసుకెళ్లేందుకు ఎలా అనుమతులు ఇచ్చారంటూ విమర్శలు ఎదుర్కొంటోంది. 
 
ఇంకా ఇతర దేశ ఆటగాళ్లు విదేశాల్లో సిరీస్‌లకు తమ గర్ల్‌ ఫ్రెండ్స్‌తో వెళ్లే సంస్కృతి ఉంది. కాని భారతదేశంలో అలాంటివి నిషేధం. అయినా కూడా ఎలా అధికారికంగా కోహ్లితో అనుష్కను అనుమతించారనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేస్తోంది.
 
టీమ్‌ మేనేజర్‌ కోహ్లి వెంట అనుష్కను అనుమతించక పోవడంతో బీసీసీఐ పెద్దల నుండి అనుమతి తెచ్చినట్లు తెలుస్తోంది. మీడియాకు సమాధానం చెబుతానన్న కోహ్లి బీసీసీఐ పెద్దలకు తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పి కోహ్లి వారిని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా బీసీసీఐ కూడా అంగీకరించింది. 
 
కోహ్లి త్వరలో అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పడం వల్లే అనుమతులు ఇచ్చామని, ఇందుకు సంబంధించి ఏమైన చిక్కులు వస్తే తాను చూసుకుంటానని కోహ్లి చెప్పాడని బీసీసీఐ వర్గాల వారు చెబుతున్నారు.
 
మీడియాకు కోహ్లి సమాధానం చెబుతాను అనడం వల్ల అనుమతించామని బీసీసీఐ ముఖ్య అధికారి చెప్పుకొచ్చాడు. మరి త్వరలో అనుష్కను కోహ్లి పెళ్లి చేసుకుంటాడా అనేది వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu