బ్రిస్బేన్ టెస్టుకు ఆస్ట్రేలియా రెడీ అవుతోంది. ఇంకా భారత్పై ఆధిక్యం కోసం ఆస్ట్రేలియా ఆరాటపడుతోంది. బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో ఈ మ్యాచ్ రేపు ఆరంభం కానుంది. పిచ్ పేస్కు అనుకూలించినా భయపడబోమని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేస్తుండగా, 2-0 ఆధిక్యానికి ప్రయత్నిస్తామని ఆసీస్ యువ సారథి స్టీవెన్ స్మిత్ చెబుతున్నాడు.
ఈ స్టార్ ఆల్ రౌండర్ మీడియాతో మాట్లాడుతూ, రెండో టెస్టు ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నామని తెలిపాడు. కొన్నివారాలుగా సాధారణ పిచ్లపై ఆడిన తమ బౌలర్లు, ఇప్పుడు జీవం తొణికసలాడే గబ్బా పిచ్పై బౌలింగ్ చేసేందుకు తహతహలాడుతున్నారని స్మిత్ చెప్పుకొచ్చాడు. పిచ్పై పచ్చిక కారణంగా జట్టులోకి మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్ వుడ్లను తీసుకువచ్చామని వెల్లడించాడు. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ నెగ్గిన సంగతి తెలిసిందే.