Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీలో చేరనున్న సౌరవ్ గంగూలీ.. కమలనాథుల మంతనాలు!

బీజేపీలో చేరనున్న సౌరవ్ గంగూలీ.. కమలనాథుల మంతనాలు!
, గురువారం, 22 జనవరి 2015 (12:14 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు కమలనాథులు ఆయనతో మంతనాలు జరుపుతున్నారు.
 
వెస్ట్ బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందుకోసం కమలనాథులు చాపకింద నీరులా తమ ప్రణాళికలకు పదునుపెడుతున్నారు. ఇందులోభాగంగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులను తమ వైపుకు ఆకర్షించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. 
 
దీంతో గుంగూలీతో బీజేపీ అధిష్టాన సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చర్చలు సఫలమైతే గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ క్రికెట్ ప్రముఖ వ్యక్తులో ఒకరైన గంగూలీకీ భారీ అభిమానగణం ఉంది. ప్రత్యేకంగా బెంగాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu